సౌదీ అరేబియాలో 42 మంది పాకిస్థానీయులు మృతి

- August 25, 2018 , by Maagulf
సౌదీ అరేబియాలో 42 మంది పాకిస్థానీయులు మృతి

రియాద్: హజ్‌ యాత్రకు వెళ్తూ సుమారు 42 మంది పాకిస్తానీలు సౌదీ అరేబియాలో మృతి చెందారని పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రోడ్డు ప్రమాదాల్లో కొందరు, రద్దీతో ఊపిరాడక మరికొందరు మరణించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో 12 మంది మహిళలు కాగా 30 మంది మగవారు ఉన్నారు. అయితే వీరంతా 40 నుంచి 80 ఏళ్ల మధ్య వయసువారే. ఈ యేడాదిలో మొత్తం 1,84,210 మంది పాకిస్తాన్‌కు యాత్రికులు హజ్‌ను దర్శించడానికి సౌదీ అరేబియా చేరుకున్నారని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది కూడా ఇలాంటి దుర్ఘటనే ఒకటి సౌది అరేబియాలో చోటు చేసుకుంది. ఈజిప్టుకు చెందిన సుమారు 35 మంది హజ్ యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు. కాగా ఈ మృతులంతా 60 నుంచి 85 ఏళ్ల వయసువారే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com