శొంఠి పొడి టీ... ఆ సమస్యకు భేషుగ్గా పనిచేస్తుంది... వెల్లుల్లి ఉపయోగాలు...
- August 26, 2018
నడుమునొప్పి చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య. నడుము పట్టేయడం, ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడడం, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు వంటివి నడుము నొప్పులకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో చికిత్స ఉంది.
పీచు పదార్థం అధికంగా ఉంటే ఆకుకూరలు, కాయగూరలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్ పెంచే సెనగలు, మసాలా పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు.
ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







