శొంఠి పొడి టీ... ఆ సమస్యకు భేషుగ్గా పనిచేస్తుంది... వెల్లుల్లి ఉపయోగాలు...
- August 26, 2018
నడుమునొప్పి చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య. నడుము పట్టేయడం, ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడడం, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు వంటివి నడుము నొప్పులకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో చికిత్స ఉంది.
పీచు పదార్థం అధికంగా ఉంటే ఆకుకూరలు, కాయగూరలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్ పెంచే సెనగలు, మసాలా పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు.
ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









