ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పి.వి సింధు

- August 27, 2018 , by Maagulf
ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పి.వి సింధు

ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న సింధు సెమీస్‌లో 21-17,15-21, 21-10 స్కోర్‌తో యమగుచిపై విజయం సాధించింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్ సింధు గెలిస్తే… తర్వాత పుంజుకున్న యమగుచి స్కోర్ సమం చేసింది. అయితే మ్యాచ్ డిసైడింగ్ గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తనదైన నెట్‌గేమ్‌తో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సింధు , వరల్డ్ నెంబర్‌ వన్ తైజుయింగ్‌తో తలపడనుంది. అటు మరో సెమీస్‌లో పరాజయం పాలైన సైనా కాంస్యంతో సరిపెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com