మిక్స్‌డ్ టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం గెలిచిన భారత్

- August 29, 2018 , by Maagulf
మిక్స్‌డ్ టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం గెలిచిన భారత్

జకర్తా: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. మిక్స్‌డ్ టేబుల్ టెన్నిస్‌లో.. మానిక్ బత్రా, శరత్ కమల్‌కు చెందిన భారత జోడి సెమీస్‌లో ఓడింది. సెమీస్‌లో చైనా జంట చేతిలో భారత్ ఓటమిపాలైంది. అంతకుముందు క్వార్టర్స్‌లో అతి పటిష్టమైన కొరియాపై భారత్ జోడి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మానిక్ బత్రా, శరత్ కమల్ జోడి 4-11, 12-10, 6-11, 11-6, 11-8 స్కోర్ తేడాతో సిమ్ హో చుయ్‌, సాంగ్ జీ అన్ జోడిని ఓడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com