డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్: 8 మంది అరెస్ట్
- August 29, 2018
మస్కట్: నలుగురు వలసదారులతో సహా మొత్తం 8 మందిని డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్ నేరాభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఓ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి 14 కిలోల మర్ఫిన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ గ్యాంగ్తో కలిసి వీరు డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరో కేసులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని విలాయత్ ఆఫ్ సీబ్లో అరెస్ట్ చేశారు. అతని నుంచి ఐదు కిలోల మరిజువానా మరియు మార్ఫిన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడో కేసులో ఒమనీ జాతీయుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి 3,000 ప్యాకెట్ల ఖాత్ని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఆసియా జాతీయుల్ని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేయగా, మరో ఆసియా జాతీయుడ్ని విలాయత్ ఆఫ్ షినాస్లో అరెస్ట్ చేశారు. మొత్తం అరెస్టయినవారందరినీ జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









