డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్: 8 మంది అరెస్ట్
- August 29, 2018
మస్కట్: నలుగురు వలసదారులతో సహా మొత్తం 8 మందిని డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్ నేరాభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఓ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి 14 కిలోల మర్ఫిన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ గ్యాంగ్తో కలిసి వీరు డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరో కేసులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని విలాయత్ ఆఫ్ సీబ్లో అరెస్ట్ చేశారు. అతని నుంచి ఐదు కిలోల మరిజువానా మరియు మార్ఫిన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడో కేసులో ఒమనీ జాతీయుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి 3,000 ప్యాకెట్ల ఖాత్ని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఆసియా జాతీయుల్ని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేయగా, మరో ఆసియా జాతీయుడ్ని విలాయత్ ఆఫ్ షినాస్లో అరెస్ట్ చేశారు. మొత్తం అరెస్టయినవారందరినీ జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్