డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్: 8 మంది అరెస్ట్
- August 29, 2018
మస్కట్: నలుగురు వలసదారులతో సహా మొత్తం 8 మందిని డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్ నేరాభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఓ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి 14 కిలోల మర్ఫిన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ గ్యాంగ్తో కలిసి వీరు డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరో కేసులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని విలాయత్ ఆఫ్ సీబ్లో అరెస్ట్ చేశారు. అతని నుంచి ఐదు కిలోల మరిజువానా మరియు మార్ఫిన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడో కేసులో ఒమనీ జాతీయుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి 3,000 ప్యాకెట్ల ఖాత్ని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఆసియా జాతీయుల్ని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేయగా, మరో ఆసియా జాతీయుడ్ని విలాయత్ ఆఫ్ షినాస్లో అరెస్ట్ చేశారు. మొత్తం అరెస్టయినవారందరినీ జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!







