'ఎయిర్‌ ఏషియా' వారి విదేశీ బంపర్ ఆఫర్

- August 29, 2018 , by Maagulf
'ఎయిర్‌ ఏషియా' వారి విదేశీ బంపర్ ఆఫర్

టూరిస్టులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఏషియా టికెట్ చార్జీలను భారీగా తగ్గించింది. థాయిలాండ్ లోని టూరిస్ట్ స్పాట్స్ కు టూరిస్టులను ఆకర్షించేందుకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్ చార్జీని గరిష్టంగా రూ. 4,399 గా ప్రకటించింది. అయితే తగ్గించిన ఇంటర్నేషనల్ చార్జీలు సెప్టెంబర్ 2 వరకే వర్తిస్తాయి. అయితే ప్రయాణ తేదీలు మాత్రం ఆగస్టు 27, 2018-ఫిబ్రవరి 17, 2019 వరకు ఉండాలని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, చియంద్ మాయి తదితర ప్రాంతాలకు ప్రత్యేక ఫ్లయిట్లు నడుపుతోంది. డొమెస్టిక్ విభాగంలో హైదరాబాద్-భువనేశ్వర్ కు, అలాగే బెంగళూరు-నాగపూర్ కు సైతం రూ. 1,999 గానే నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com