'సేవ్‌ ద చిల్డ్రన్‌ ఇండియా' స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణ

- August 29, 2018 , by Maagulf
'సేవ్‌ ద చిల్డ్రన్‌ ఇండియా' స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణ

హైదరాబాద్:సేవ్‌ ద చిల్డ్రన్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణలో భాగంగా నగర సోషలైట్‌ సామియా ఆలంఖాన్‌తో కలిసి బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి సతీమణి మానా నిర్వహించిన ఆరిష్‌ ఎగ్జిబిషన్‌ నగరవాసులకు వినూత్న అనుభవాలను కలిగించింది. తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగిన ప్రదర్శనలో విక్రఫ్‌ ఫద్నీస్‌, రెహా పిళ్లై, మహీప్‌ కపూర్‌, క్విన్నీ సింగ్‌లాంటి 70 మందికి పైగా డిజైనర్లు తమ కలెక్షన్స్‌ ప్రదర్శించారు. గ్లామర్‌, గివింగక్ష గో టుగెదర్‌ అనే నేపథ్యంతో ఈ ప్రదర్శన చేశామని మానా తెలిపారు. కార్యక్రమంలో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ పింకీరెడ్డి, పద్మా రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com