పెరిగిన బంగారం ధర

- August 30, 2018 , by Maagulf
పెరిగిన బంగారం ధర

న్యూ ఢిల్లీ: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో పసిడి ధర పెరిగింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 పెరిగి రూ.31,200కు చేరింది. పండుగల సీజన్‌ కావడంతో వినియోగదారుల డిమాండ్‌ను చేరుకోవడానికి నగల వ్యాపారుల కొనుగోళ్లు బాగా పెరిగాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూలత ఉందని తెలిపాయి.

నేటి బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.38,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం పెరిగి 1206.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.24శాతం పెరిగి 14.73డాలర్లుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక దశలో రూ.70.82కు పడిపోవడంతో దిగుమతుల వ్యయం పెరుగుతోందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com