లిబియా శిబిరాల్లో తిండి, నీరు లేక అలమటిస్తున్న శరణార్థులు
- August 30, 2018
ట్రిపోలి:యూరప్ చేరుకుందామని బయలుదేరిన వందలాదిమంది శరణార్ధులు లిబియాలో ప్రభుత్వ అధీనంలోని శిబిరాల్లో చిక్కుకుపోయి తినడానికి తిండి, తాగడానికి నీరు లేకుండా అలమటిస్తున్నారు. వీరిలో ఐదేళ్ళు నిండని చిన్నారులతో సహా మహిళలు పెద్ద సంఖ్యలో వున్నారు. ట్రిపోలిలో ప్రత్యర్ధి వర్గాల మధ్య పోరు ఉధృతం కావడంతో శరణార్ధులు, వలసవాదులను ఎవరూ పట్టించుకునేవారే లేరు. ట్రిపోలికి దక్షిణంగా గల ప్రభుత్వ శిబిరమైన అయిన్ జరాలో వందలాదిమంది ప్రజలు కిక్కిరిసిపోయి వున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్కర్ ఒకరు తెలిపారు. ఆ నిర్బంధ శిబిరంలో దాదాపు 400మందికి పైగా వున్నారు. వారిలో 200మంది వరకు మహిళలు, 200మందికి పైగా పురుషులు వున్నారు. ఐదేళ్ళలోపు చిన్నారులు 20మంది వరకు వున్నారని, వీరు తిండి, నీరు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మరో మూడు శిబిరాల్లో 1500 వరకు వున్నట్లు తెలుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో కొంతమంది పారిపోగా, మరికొంతమందిని ఇతర శిబిరాలకు తరలించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..