తెలుగు అమ్మాయితో కర్ణాటక సీఎం కొడుకు పెళ్లి!
- August 31, 2018
అమరావతి:త్వరలోనే విజయవాడ అమ్మాయితో కర్నాటక సీఎం కుమారుడి పెళ్లి జరగబోతోంది. కుమారస్వామి తనయుడు నిఖిల్ వివాహం.. కృష్ణాజిల్లాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో జరిపించేందుకు మాటలన్నీ ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది. పారిశ్రామికవేత్తలు రఘురామకృష్ణంరాజు, లగడపాటి రాజగోపాల్ పెళ్లిపెద్దలుగా వ్యవహరించబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
నిశ్చితార్థం, వివాహం ఎప్పుడు ఎక్కడ జరపాలి లాంటి మాటలన్నీ పూర్తయ్యే వరకూ మిగతా వివరాలన్నీ గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు. కర్నాటక సీఎం కుమారస్వామి ఇవాళ ఉదయాన్నే సతీసమేతంగా విజయవాడకు వచ్చారు. కాసేపట్లో దుర్గగుడికి వెళ్లి అమ్మవారిని కూడా దర్శించుకోబోతున్నారు.
విజయవాడ వచ్చిన కుమారస్వామిని ఏపీ సీఎం చంద్రబాబు కలిసారు. గేట్వే హోటల్కి వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో రఘురామకృష్ణం రాజు, లగడపాటి రాజగోపాల్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పెళ్లి అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
బెంగళూరులో ఉండే కుమారస్వామికి , విజయవాడ పారిశ్రామిక వేత్తకు మధ్య వియ్యం కలిపేందుకు ఎవరు ప్రయత్నం చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కుమారస్వామే వెల్లడిస్తారని అంటున్నారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







