గల్ఫ్ ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్
- September 02, 2018తెలంగాణ:కాస్తా అటో ఇటో అంతా ఊహించిందే జరిగింది. ముందస్తుపై మరింత బలమైన సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. త్వరలోనే రాజకీయ ప్రకటన ఉంటుదని పొలిటికల్ బాంబ్ పేల్చారు. అయితే..ఆ నిర్ణయం ఏంటో మీరే చూస్తారంటూ సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూనే..ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే డైలాగులు పేల్చారు. తెలంగాణ సెంటిమెంట్ కు కొనసాగింపుగా ఈ సారి ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు కేసీఆర్.రాష్ట్ర భవిస్యత్ కోసం, తెలంగాణ సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకుంటే మందిదే మీరే తీసుకోండని కేబినెట్ మిత్రులు చెప్పారు. ఆ నిర్ణయం ఏమిటో త్వరలోనే మీరు వింటారు అంటూ ముందస్తుకు సూచనలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాం గిరీచేస్తున్నాయని ఎద్దేవాచేశారు. వారిలా తాము ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాయాలా? అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.చాలా కాలం నుంచి NRI పాలసీ కోసం గల్ఫ్ లో ఎదురు చూస్తున్న ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..