టెర్రర్‌ గ్రూప్‌ ఏర్పాటు: 9 మందికి జైలు శిక్ష

- September 05, 2018 , by Maagulf
టెర్రర్‌ గ్రూప్‌ ఏర్పాటు: 9 మందికి జైలు శిక్ష

బహ్రెయిన్: పోలీసులపై దాడులకోసం టెర్రర్‌ గ్రూప్‌ని ఏర్పాటు చేసుకున్న నేరానికిగాను తొమ్మిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. హోమ్‌ మేడ్‌ గన్‌తో పోలీసులపై దాడి చేయాలన్నది తొమ్మిది మంది నిందితుల ప్లాన్‌. అయితే, వారి దాడి యత్నాన్ని పోలీసులు తిప్పి కొట్టారు. సంఘటనా స్థలం నుంచి మొదటి, రెండవ నిందితుడ్ని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. అనంతరం జరిగిన విచారణలో మొదటి ఇద్దరు నిందితులకు వెపన్‌ని సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత తొమ్మిది మంది సభ్యులుగల టెర్రర్‌ గ్రూప్‌లో ఈ ముగ్గురూ సభ్యులని పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో నిందితులపై నేరాల్ని నిరూపించగలిగారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com