ఆరో తేదిన సంచలన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
- September 05, 2018
ముందస్తుకు ముహుర్తం ఫిక్స్ అయింది. వారం, తిథి, నక్షత్రం అన్ని కలిసొచ్చిన గురువారం రోజునే అసెంబ్లీ రద్దుకు రెడీ అయ్యారు కేసీఆర్. కేబినెట్ భేటీలో తీర్మానం చేసి..ఆ తీర్మానాన్ని తానే స్వయంగా గవర్నర్ కు అందించనున్నారు. మరోవైపు టిక్కెట్లు కన్ఫమ్ అయిన నేతలకు ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సూచిస్తున్నారు సీఎం.
ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ తొలి అసెంబ్లీ మరికొద్ది గంటల్లో రద్దు కాబోతోంది. ఎమ్మెల్యేలు అంతా మాజీలు కాబోతున్నారు. అదృష్ట సంఖ్యగా చెప్పుకునే ఆరో తేదిన సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. మధ్యాహ్నం సమావేశం కానున్న కేబినెట్..శాసనసభరద్దుపై ఏకవాక్య తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానం ప్రతిని సీఎం కేసీఆరే స్వయంగా గవర్నర్ కు అందించే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీ రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గవర్నర్ అనుమతితో గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
మరికొద్ది గంటల్లో జరగబోయే కేబినెట్ సమావేశం కోసం ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ముందస్తుపై మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు. పరిపాలనపరంగా బుధవారమే దాదాపుగా ఆఖరు రోజు కావటంతో ఉన్నతాధికారుల బదిలీలు, కీలకమైన వారికి ముఖ్య బాధ్యతల అప్పగింతల అంశాలపై ఈ రాత్రికల్లా కసరత్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి. గురువారం కేబినెట్ సమావేశం సమాయానల్లా నిర్ణయాలు వెలువడొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!