ఒమన్ స్కూల్ బస్లో ఎనిమిదేళ్ళ చిన్నారి దుర్మరణం
- September 07, 2018
మస్కట్:రువీలోని ఓ స్కూల్ బస్లో వుండిపోయిన ఎనిమిదేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అడ్ అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. ఉదయం నుంచి బస్సులో ఉండిపోవడం వల్ల ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన స్థితిలో కన్పించినట్లు రాయల్ పోలీస్ ఒమన్ వెల్లడించింది. బాలుడ్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారని రాయల్ ఒమన్ పోలీస్ ప్రతినిథులు చెప్పారు. బస్ డ్రైవర్లు, బస్ని లాక్ చేసే ముందు పూర్తిగా ఆ బస్సులో ఎవరూ లేరని నిర్ధారించుకోవాల్సి వుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ సూచించింది. ఈ ఘటనపై స్పందించిన ఒమన్ నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ఆ బస్గానీ, బస్ డ్రైవర్గానీ తమ ఫ్లీట్కి చెందినవారు కాదని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







