ఒమన్ స్కూల్ బస్లో ఎనిమిదేళ్ళ చిన్నారి దుర్మరణం
- September 07, 2018
మస్కట్:రువీలోని ఓ స్కూల్ బస్లో వుండిపోయిన ఎనిమిదేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అడ్ అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. ఉదయం నుంచి బస్సులో ఉండిపోవడం వల్ల ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన స్థితిలో కన్పించినట్లు రాయల్ పోలీస్ ఒమన్ వెల్లడించింది. బాలుడ్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారని రాయల్ ఒమన్ పోలీస్ ప్రతినిథులు చెప్పారు. బస్ డ్రైవర్లు, బస్ని లాక్ చేసే ముందు పూర్తిగా ఆ బస్సులో ఎవరూ లేరని నిర్ధారించుకోవాల్సి వుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ సూచించింది. ఈ ఘటనపై స్పందించిన ఒమన్ నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ఆ బస్గానీ, బస్ డ్రైవర్గానీ తమ ఫ్లీట్కి చెందినవారు కాదని పేర్కొంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









