ఒమన్ స్కూల్ బస్లో ఎనిమిదేళ్ళ చిన్నారి దుర్మరణం
- September 07, 2018
మస్కట్:రువీలోని ఓ స్కూల్ బస్లో వుండిపోయిన ఎనిమిదేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అడ్ అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. ఉదయం నుంచి బస్సులో ఉండిపోవడం వల్ల ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన స్థితిలో కన్పించినట్లు రాయల్ పోలీస్ ఒమన్ వెల్లడించింది. బాలుడ్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారని రాయల్ ఒమన్ పోలీస్ ప్రతినిథులు చెప్పారు. బస్ డ్రైవర్లు, బస్ని లాక్ చేసే ముందు పూర్తిగా ఆ బస్సులో ఎవరూ లేరని నిర్ధారించుకోవాల్సి వుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ సూచించింది. ఈ ఘటనపై స్పందించిన ఒమన్ నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ఆ బస్గానీ, బస్ డ్రైవర్గానీ తమ ఫ్లీట్కి చెందినవారు కాదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







