డ్రగ్స్‌తో యూఏఈ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ వ్యక్తి

- September 07, 2018 , by Maagulf
డ్రగ్స్‌తో యూఏఈ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ వ్యక్తి

అబుదాబీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి నుంచి 312 కిలోల హాషిష్‌ సీడ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, యూఏఈలో ఏయే డ్రగ్స్‌పై నిషేధం వుందో తనకు తెలియదంటూ పట్టుబడ్డ వ్యక్తి చెబుతున్నాడు. ఈ కేసు విచారణ అబుదాబీ క్రిమినల్‌ కోర్టులో జరుగుతోంది. కొన్ని నెలల క్రితం నిందితుడ్ని కస్టమ్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానం యెదుట నిందితుడు తన వాదనను విన్పించాడు. పాకిస్తాన్‌ నుంచి నిందితుడు వచ్చాడు. బ్యాగ్‌లో ఓ మూల హాషిష్‌ సీడ్స్‌ని వుంచి నిందితుడు పాకిస్తాన్‌ నుంచి ఇండియాకి వాటిని తీసుకొచ్చినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. నిందితుడి యూరిన్‌ శాంపిల్‌లోనూ హాషిష్‌ పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్‌ సేవించడం, అలాగే వాటిని స్మగుల్‌ చేయడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపారు. పాకిస్తాన్‌లో హాషిష్‌ని సాధారణంగా ఉపయోగిస్తామనీ, నొప్పి నివారిణిగా అవి ఉపయోగపడ్తాయని నిందితుడు చెబుతున్నాడు. సెప్టెంబర్‌ 11న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com