డ్రగ్స్తో యూఏఈ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ వ్యక్తి
- September 07, 2018
అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి నుంచి 312 కిలోల హాషిష్ సీడ్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, యూఏఈలో ఏయే డ్రగ్స్పై నిషేధం వుందో తనకు తెలియదంటూ పట్టుబడ్డ వ్యక్తి చెబుతున్నాడు. ఈ కేసు విచారణ అబుదాబీ క్రిమినల్ కోర్టులో జరుగుతోంది. కొన్ని నెలల క్రితం నిందితుడ్ని కస్టమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం యెదుట నిందితుడు తన వాదనను విన్పించాడు. పాకిస్తాన్ నుంచి నిందితుడు వచ్చాడు. బ్యాగ్లో ఓ మూల హాషిష్ సీడ్స్ని వుంచి నిందితుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వాటిని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడి యూరిన్ శాంపిల్లోనూ హాషిష్ పాజిటివ్గా తేలింది. డ్రగ్స్ సేవించడం, అలాగే వాటిని స్మగుల్ చేయడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపారు. పాకిస్తాన్లో హాషిష్ని సాధారణంగా ఉపయోగిస్తామనీ, నొప్పి నివారిణిగా అవి ఉపయోగపడ్తాయని నిందితుడు చెబుతున్నాడు. సెప్టెంబర్ 11న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







