డ్రగ్స్తో యూఏఈ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ వ్యక్తి
- September 07, 2018
అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి నుంచి 312 కిలోల హాషిష్ సీడ్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, యూఏఈలో ఏయే డ్రగ్స్పై నిషేధం వుందో తనకు తెలియదంటూ పట్టుబడ్డ వ్యక్తి చెబుతున్నాడు. ఈ కేసు విచారణ అబుదాబీ క్రిమినల్ కోర్టులో జరుగుతోంది. కొన్ని నెలల క్రితం నిందితుడ్ని కస్టమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం యెదుట నిందితుడు తన వాదనను విన్పించాడు. పాకిస్తాన్ నుంచి నిందితుడు వచ్చాడు. బ్యాగ్లో ఓ మూల హాషిష్ సీడ్స్ని వుంచి నిందితుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వాటిని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడి యూరిన్ శాంపిల్లోనూ హాషిష్ పాజిటివ్గా తేలింది. డ్రగ్స్ సేవించడం, అలాగే వాటిని స్మగుల్ చేయడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపారు. పాకిస్తాన్లో హాషిష్ని సాధారణంగా ఉపయోగిస్తామనీ, నొప్పి నివారిణిగా అవి ఉపయోగపడ్తాయని నిందితుడు చెబుతున్నాడు. సెప్టెంబర్ 11న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







