ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై మరణ శిక్ష: ఈజిప్టు కోర్టు
- September 08, 2018
కైరో: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2013లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న దాదాపు 75 మందికి ఈజిప్టు కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. ఈ శిక్ష పడిన వారిలో నిషిద్ధ ''ముస్లిం బ్రదర్హుడ్'' సంస్ధకు చెందిన వారు కూడా ఉన్నారు. కైరోలోని క్రిమినల్కోర్టు విధించిన ఈశిక్ష ఈజిప్టు ఉన్నతాదికారి గ్రాండ్ ముఫ్తీ పరిశీలనకు వెళ్ళింది. కోర్టు తీర్పును కాదనే అధికారం ఆయనకున్నప్పటికీ, ఈ తీర్పును నిర్థారించారు. ముస్లిం బ్రదర్హుడ్లో కీలక పాత్ర పోషిస్తున్న మహమ్మద్ బడెయితో సహా దాదాపు 739 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. షాకన్గా అందరికి తెలిసిన ఫొటో జర్నలిస్టు మహ్మద్ అబు జియద్ కూడా వీరిలో ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు సంబంధించిన వార్తను సేకరించేందుకు వెళ్ళిన జర్నలిస్టు జియద్ 2013 నుండి జైలులోనే ఉన్నాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







