ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై మరణ శిక్ష: ఈజిప్టు కోర్టు
- September 08, 2018
కైరో: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2013లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న దాదాపు 75 మందికి ఈజిప్టు కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. ఈ శిక్ష పడిన వారిలో నిషిద్ధ ''ముస్లిం బ్రదర్హుడ్'' సంస్ధకు చెందిన వారు కూడా ఉన్నారు. కైరోలోని క్రిమినల్కోర్టు విధించిన ఈశిక్ష ఈజిప్టు ఉన్నతాదికారి గ్రాండ్ ముఫ్తీ పరిశీలనకు వెళ్ళింది. కోర్టు తీర్పును కాదనే అధికారం ఆయనకున్నప్పటికీ, ఈ తీర్పును నిర్థారించారు. ముస్లిం బ్రదర్హుడ్లో కీలక పాత్ర పోషిస్తున్న మహమ్మద్ బడెయితో సహా దాదాపు 739 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. షాకన్గా అందరికి తెలిసిన ఫొటో జర్నలిస్టు మహ్మద్ అబు జియద్ కూడా వీరిలో ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు సంబంధించిన వార్తను సేకరించేందుకు వెళ్ళిన జర్నలిస్టు జియద్ 2013 నుండి జైలులోనే ఉన్నాడు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







