దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయులకి సన్మానం
- September 10, 2018
మస్కట్: ముగ్గురు భారతీయ వలసదారులకు రాయల్ ఒమన్ పోలీస్ సన్మానం చేసింది. అల్ బతినాలో ఓ దొంగతనాన్ని అరికట్టడంలో ఈ ముగ్గురూ చూపిన చొరవకు ఈ గౌరవం దక్కింది. మాల్లో దొంగతనానికి పల్పడిన నిందితుల్ని పట్టుకునే క్రమంలో వలసదారులు పోలీసులకు సహాయ సహకారాలు అందించారు. నిందితులు గ్లాస్ డోర్ నుంచి కమర్షియల్ సెంటర్లోకి అడుగు పెట్టినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - అల్ సువైక్ పోలీస్ స్టేషన్ వెల్లడించింది. వారిని అరెస్ట్ చేసేందుకు వలసదారులు సహకరించారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించిన సొమ్ముని, నేరం చేయడానికి ఉపయోగించిన ఉపకరణాల్నీ స్వాధీనం చేసుకున్నారు. అల్ బతినా గవర్నరేట్ చీఫ్ ఆఫ్ పోలీస్ బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ ఘైలాని, భారతీయ వలసదారుల్ని సన్మానించారు. రెసిడెంట్స్ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









