దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయులకి సన్మానం
- September 10, 2018
మస్కట్: ముగ్గురు భారతీయ వలసదారులకు రాయల్ ఒమన్ పోలీస్ సన్మానం చేసింది. అల్ బతినాలో ఓ దొంగతనాన్ని అరికట్టడంలో ఈ ముగ్గురూ చూపిన చొరవకు ఈ గౌరవం దక్కింది. మాల్లో దొంగతనానికి పల్పడిన నిందితుల్ని పట్టుకునే క్రమంలో వలసదారులు పోలీసులకు సహాయ సహకారాలు అందించారు. నిందితులు గ్లాస్ డోర్ నుంచి కమర్షియల్ సెంటర్లోకి అడుగు పెట్టినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - అల్ సువైక్ పోలీస్ స్టేషన్ వెల్లడించింది. వారిని అరెస్ట్ చేసేందుకు వలసదారులు సహకరించారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించిన సొమ్ముని, నేరం చేయడానికి ఉపయోగించిన ఉపకరణాల్నీ స్వాధీనం చేసుకున్నారు. అల్ బతినా గవర్నరేట్ చీఫ్ ఆఫ్ పోలీస్ బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ ఘైలాని, భారతీయ వలసదారుల్ని సన్మానించారు. రెసిడెంట్స్ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







