దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయులకి సన్మానం
- September 10, 2018
మస్కట్: ముగ్గురు భారతీయ వలసదారులకు రాయల్ ఒమన్ పోలీస్ సన్మానం చేసింది. అల్ బతినాలో ఓ దొంగతనాన్ని అరికట్టడంలో ఈ ముగ్గురూ చూపిన చొరవకు ఈ గౌరవం దక్కింది. మాల్లో దొంగతనానికి పల్పడిన నిందితుల్ని పట్టుకునే క్రమంలో వలసదారులు పోలీసులకు సహాయ సహకారాలు అందించారు. నిందితులు గ్లాస్ డోర్ నుంచి కమర్షియల్ సెంటర్లోకి అడుగు పెట్టినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - అల్ సువైక్ పోలీస్ స్టేషన్ వెల్లడించింది. వారిని అరెస్ట్ చేసేందుకు వలసదారులు సహకరించారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించిన సొమ్ముని, నేరం చేయడానికి ఉపయోగించిన ఉపకరణాల్నీ స్వాధీనం చేసుకున్నారు. అల్ బతినా గవర్నరేట్ చీఫ్ ఆఫ్ పోలీస్ బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ ఘైలాని, భారతీయ వలసదారుల్ని సన్మానించారు. రెసిడెంట్స్ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







