విద్యుదాఘాతం: 8 ఏళ్ళ చిన్నారి మృతి
- September 10, 2018
మస్కట్: ఎనిమిదేళ్ళ బాలిక, విలాయత్ ఆఫ్ ఇబ్రాలో విద్యుత్ షాక్కి గురై ప్రాణాలు కోల్పోయింది. రాయల్ ఒమన్ పోలీస్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించడం జరిగింది. బాధితురాలి ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిన్నారి, కరెంట్ వైర్ని టచ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఎమర్జన్సీ సర్వీసెస్, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అయితే, విద్యుత్ ఉపకరణాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, పిల్లలు కరెంట్ వైర్లకు దూరంగా వుండేలా చూడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







