గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లో భారీ భద్రత
- September 12, 2018హైదరాబాద్:గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి 14వేల మందిని మంటపాల వద్ద సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. ప్రతి చోట విగ్రహాల ప్రతిష్టాపనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ముందస్తుగానే చేస్తున్నందున.. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకూ 8వేల మంటపాల్లో విగ్రహాలు కొలువుదీరాయి. అటు, రాత్రి సమయాల్లో ప్రతి మంటపం వద్ద కనీసం ఇద్దరు ఉండి ఏర్పాట్లు, భద్రత చూసుకునేలా ప్లాన్ చేశారు. ఉత్సవాలు ముగిసాక ఆఖరు రోజున నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఇప్పటి నుంచే సెక్యూరిటీ పటిష్టం చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సాగే 18 కిలోమీటర్ల పొడవునా భారీగా బలగాలను మోహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?