ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చిన ఒమనీ మహిళ
- September 13, 2018
మస్కట్: ఓ ఒమనీ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. రాయల్ హాస్పిటల్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే పుట్టినవారిలో ఓ చిన్నారి మృతి చెందడం జరిగింది. గత నెలలో ఈద్ సెలవు రోజున ఐదుగురు చిన్నారులు జన్మించారు. వీరిలో నలుగురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శస్త్ర చికిత్స (సిజేరియన్) ద్వారా ఐదుగురు పిల్లల్ని ఆమె గర్భం నుంచి బయటకు తీశారు. అయితే వెంటనే ఓ చిన్నారి మృతి చెందిందని రాయల్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. కిలో నుంచి 1.2 కిలోగ్రాముల బరువు మాత్రమే చిన్నారులు వున్నారనీ, నెల రోజులపాటు ఇన్క్యుబేటర్లో వుంచిన తర్వాత 1.5 కిలోల బరువుకి చేరుకున్నారని వైద్యులు వెల్లడించారు. వీరంతా ప్రి మెచ్యూర్ బేబీస్ అని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







