ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చిన ఒమనీ మహిళ
- September 13, 2018
మస్కట్: ఓ ఒమనీ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. రాయల్ హాస్పిటల్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే పుట్టినవారిలో ఓ చిన్నారి మృతి చెందడం జరిగింది. గత నెలలో ఈద్ సెలవు రోజున ఐదుగురు చిన్నారులు జన్మించారు. వీరిలో నలుగురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శస్త్ర చికిత్స (సిజేరియన్) ద్వారా ఐదుగురు పిల్లల్ని ఆమె గర్భం నుంచి బయటకు తీశారు. అయితే వెంటనే ఓ చిన్నారి మృతి చెందిందని రాయల్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. కిలో నుంచి 1.2 కిలోగ్రాముల బరువు మాత్రమే చిన్నారులు వున్నారనీ, నెల రోజులపాటు ఇన్క్యుబేటర్లో వుంచిన తర్వాత 1.5 కిలోల బరువుకి చేరుకున్నారని వైద్యులు వెల్లడించారు. వీరంతా ప్రి మెచ్యూర్ బేబీస్ అని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







