సెర్బియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండియా
- September 16, 2018
సెర్బియా:ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెర్బియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సెర్బియా అధ్యక్షుడు మరియు భారత ఉపరాష్ట్రపతి సమక్షంలో ఇరుదేశాలు రెండు ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఇందులో మొదటి ఒప్పందం పంటల సంరక్షణ, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ ఫుడ్స్ మీద కాగా రెండో ఒప్పందం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ప్రసారాలు, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించింది.
సెర్బియా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సెర్బియాతో పాటు మాల్టా మరియు రొమానియాలను సందర్శించి శుక్రవారం భారత్ చేరుకోనున్నారు. ఇది ఉపరాష్ట్రపతికి రెండో విదేశీ పర్యటన. మొదటి విదేశీ పర్యటనలో లాటిన్ అమెరికా దేశాలైన గ్వాటెమాల, పనామా మరియు పెరూ దేశాలను సందర్శించి పలు ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







