సెర్బియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండియా

- September 16, 2018 , by Maagulf
సెర్బియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండియా

సెర్బియా:ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెర్బియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సెర్బియా అధ్యక్షుడు మరియు భారత ఉపరాష్ట్రపతి సమక్షంలో ఇరుదేశాలు రెండు ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఇందులో మొదటి ఒప్పందం పంటల సంరక్షణ, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ ఫుడ్స్ మీద కాగా రెండో ఒప్పందం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ప్రసారాలు, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించింది.

సెర్బియా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సెర్బియాతో పాటు మాల్టా మరియు రొమానియాలను సందర్శించి శుక్రవారం భారత్ చేరుకోనున్నారు. ఇది ఉపరాష్ట్రపతికి రెండో విదేశీ పర్యటన. మొదటి విదేశీ పర్యటనలో లాటిన్ అమెరికా దేశాలైన గ్వాటెమాల, పనామా మరియు పెరూ దేశాలను సందర్శించి పలు ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com