చైనాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన
- September 16, 2018
చైనా:తెలుగువారు ఏ రాష్ట్రంలో ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ బీజింగ్ చైనా తెలుగు అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. చైనాలో ఉంటున్న తెలుగువారంతా ఏపీకి ప్రచారకర్తలుగా మారి.. మీరు పనిచేస్తున్న కంపెనీల్లో రాష్ట్రం గురించి చెబితే రాష్ట్రానికి పరిశమల రాక పెరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికోసం చైనాలో ఉన్న తెలుగువారంతా కృషి చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారని.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత చుట్టుముట్టిన సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో చాకచక్యంగా అధిగమించి అభివృద్ధివైపు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దేశంలో చాలామంది నదుల అనుసంధానం గురించి మాట్లాడారు.. కానీ చంద్రబాబు మాత్రమే దాన్ని చేసి చూపారని వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు.
రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం వల్లే అనంతపురం జిల్లాకు కియా కార్ల కంపెనీ వచ్చిందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా అందరి కంటే ముందుందని... చైనాని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఏపీలో 240 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేశ్ వివరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







