రిటైర్మెంట్ తర్వాత కూడా యూఏఈలో.. తెలుసుకోండిలా!
- September 16, 2018రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండడానికి వలసదారులకు వీలు కల్పిస్తున్నట్లు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. అయితే ఎంతకాలం ఈ రెసిడెన్సీ పీరియడ్ వుంటుందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా షేక్ మొహమ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రియల్ విభాగానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఫీజుని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామనీ, ఒక రోజు కోర్ట్ సిస్టమ్ని ఫెడరల్ లెవల్కి సంబంధించి అప్రూవ్ చేశామని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. పబ్లిక్, ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి ఫెడరల్ స్టాండర్డ్స్ని కూడా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సమ్మర్ హాలిడే తర్వాత తొలి క్యాబినెట్ జరిగిందనీ, నేషనల్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతూనే వుంటాయని షేక్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?