రిటైర్మెంట్ తర్వాత కూడా యూఏఈలో.. తెలుసుకోండిలా!
- September 16, 2018
రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండడానికి వలసదారులకు వీలు కల్పిస్తున్నట్లు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. అయితే ఎంతకాలం ఈ రెసిడెన్సీ పీరియడ్ వుంటుందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా షేక్ మొహమ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రియల్ విభాగానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఫీజుని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామనీ, ఒక రోజు కోర్ట్ సిస్టమ్ని ఫెడరల్ లెవల్కి సంబంధించి అప్రూవ్ చేశామని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. పబ్లిక్, ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి ఫెడరల్ స్టాండర్డ్స్ని కూడా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సమ్మర్ హాలిడే తర్వాత తొలి క్యాబినెట్ జరిగిందనీ, నేషనల్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతూనే వుంటాయని షేక్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







