స్థిరాస్తులను అమ్మకానికి పెట్టిన ఎయిరిండియా

- September 16, 2018 , by Maagulf
స్థిరాస్తులను అమ్మకానికి పెట్టిన ఎయిరిండియా

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన నాలుగు అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏఏఎస్‌ఎల్‌, హెచ్‌సీఐ, ఏఐఏటీఎస్‌ఎల్‌, ఏఐఈఎస్‌ఎల్‌ల్లో ప్రభుత్వం వాటా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు దిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయ భవనం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న ఇతర స్థిరాస్తులు, విమానయాన సంస్థ భవంతులను విక్రయానికి పెట్టనుంది. ఎయిరిండియా నష్టాల్లో కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com