రూ.1378 కోట్లకు అమ్ముడుపోయిన 'టైమ్' మ్యాగజైన్
- September 17, 2018
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక టైమ్ మ్యాగజైన్ను అమ్మేశారు. మెరెడిత్ కార్పొరేషన్కు చెందిన ఈ మ్యాగజైన్ను 190 మిలియన్ డాలర్లుకు (భారత కరెన్సీలో దాదాపు రూ.1378.92కోట్లు) విక్రయించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సేల్స్ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ బెనియాఫ్ దంపతులు టైమ్ మ్యాగజైన్ కొనుగోలు చేశారు. అయితే మార్క్ బెనియాఫ్ దీన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని, సేల్స్ఫోర్స్కు ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక మ్యాగజైన్ రోజువారి కార్యకలాపాల్లో బెనియాఫ్ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి