రూ.1378 కోట్లకు అమ్ముడుపోయిన 'టైమ్' మ్యాగజైన్
- September 17, 2018వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక టైమ్ మ్యాగజైన్ను అమ్మేశారు. మెరెడిత్ కార్పొరేషన్కు చెందిన ఈ మ్యాగజైన్ను 190 మిలియన్ డాలర్లుకు (భారత కరెన్సీలో దాదాపు రూ.1378.92కోట్లు) విక్రయించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సేల్స్ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ బెనియాఫ్ దంపతులు టైమ్ మ్యాగజైన్ కొనుగోలు చేశారు. అయితే మార్క్ బెనియాఫ్ దీన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని, సేల్స్ఫోర్స్కు ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక మ్యాగజైన్ రోజువారి కార్యకలాపాల్లో బెనియాఫ్ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష