రూ.1378 కోట్లకు అమ్ముడుపోయిన 'టైమ్' మ్యాగజైన్‌

- September 17, 2018 , by Maagulf
రూ.1378 కోట్లకు అమ్ముడుపోయిన 'టైమ్' మ్యాగజైన్‌

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక టైమ్‌ మ్యాగజైన్‌ను అమ్మేశారు. మెరెడిత్‌ కార్పొరేషన్‌కు చెందిన ఈ మ్యాగజైన్‌ను 190 మిలియన్‌ డాలర్లుకు (భారత కరెన్సీలో దాదాపు రూ.1378.92కోట్లు) విక్రయించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ బెనియాఫ్‌ దంపతులు టైమ్‌ మ్యాగజైన్‌ కొనుగోలు చేశారు. అయితే మార్క్‌ బెనియాఫ్‌ దీన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని, సేల్స్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక మ్యాగజైన్‌ రోజువారి కార్యకలాపాల్లో బెనియాఫ్‌ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com