భేటీ అవ్వనున్న భారత్, పాక్
- September 19, 2018పాకిస్తాన్ తో చర్చలకు భారత ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంతో పొరుగుదేశాలతో స్నేహం సాధారణ స్థాయిలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్లో ఈనెల 26వ తేదీన భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య మళ్ళీ సంప్రదింపుల ప్రక్రియ మొదలయ్యేందుకు ఈ లేఖతో శ్రీకారం చుట్టారు. ఈనెల 27వ తేదీన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగనుంది. ఆ భేటీకి ఒక రోజు ముందు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి భేటీ అవుతారు. మరోవైపు వివిధ రకాల వస్తువులతో భారత ట్రక్కులు తమ దేశం గుండా ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళేందుకు పాకిస్తాన్ అంగీకరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?