సౌదీ టీవీలో న్యూస్‌ బులెటిన్‌ చదివిన తొలి సౌదీ మహిళ

- September 21, 2018 , by Maagulf
సౌదీ టీవీలో న్యూస్‌ బులెటిన్‌ చదివిన తొలి సౌదీ మహిళ

జెడ్డా: సౌదీ అరేబియా ప్రధా నేషనల్‌ టీవీస్టేషన్‌లో ముఖ్యమైన ఈవినింగ్‌ న్యూస్‌ బులెటిన్‌ చదివిన తొలి మహిళగా వీమ్‌ అల్‌ దఖీల్‌ రికార్డులకెక్కారు. ఒమర్‌ అల్‌ నష్వాన్‌తో కలిసి గురువారం సౌదీ టీవీ ఛానల్‌లో న్యూస్‌ని ప్రెజెంట్‌ చేశారు వీమ్‌ అల్‌ దఖీల్‌. ఈ నేపథ్యంలో సౌదీస్‌, ట్విట్టర్‌ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె పెర్ఫామెన్స్‌ అద్భుతమని, న్యూస్‌ని ప్రెజెంట్‌ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనీ, చాలా గొప్పగా న్యూస్‌ని ప్రెజెంట్‌ చేశారని అందరూ అభినందిస్తున్నారు. గతంలో అల్‌ దఖీల్‌, సిఎన్‌బిసి అరేబియాలో పనిచేశారు. మహిళలు సౌదీలోని పలు ఇతర ఛానళ్ళలో పనిచేస్తున్నారు. క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చేపట్టిన సంస్కరణ చర్యల్లో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com