సౌదీ టీవీలో న్యూస్ బులెటిన్ చదివిన తొలి సౌదీ మహిళ
- September 21, 2018
జెడ్డా: సౌదీ అరేబియా ప్రధా నేషనల్ టీవీస్టేషన్లో ముఖ్యమైన ఈవినింగ్ న్యూస్ బులెటిన్ చదివిన తొలి మహిళగా వీమ్ అల్ దఖీల్ రికార్డులకెక్కారు. ఒమర్ అల్ నష్వాన్తో కలిసి గురువారం సౌదీ టీవీ ఛానల్లో న్యూస్ని ప్రెజెంట్ చేశారు వీమ్ అల్ దఖీల్. ఈ నేపథ్యంలో సౌదీస్, ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె పెర్ఫామెన్స్ అద్భుతమని, న్యూస్ని ప్రెజెంట్ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనీ, చాలా గొప్పగా న్యూస్ని ప్రెజెంట్ చేశారని అందరూ అభినందిస్తున్నారు. గతంలో అల్ దఖీల్, సిఎన్బిసి అరేబియాలో పనిచేశారు. మహిళలు సౌదీలోని పలు ఇతర ఛానళ్ళలో పనిచేస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణ చర్యల్లో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







