సౌదీ టీవీలో న్యూస్ బులెటిన్ చదివిన తొలి సౌదీ మహిళ
- September 21, 2018
జెడ్డా: సౌదీ అరేబియా ప్రధా నేషనల్ టీవీస్టేషన్లో ముఖ్యమైన ఈవినింగ్ న్యూస్ బులెటిన్ చదివిన తొలి మహిళగా వీమ్ అల్ దఖీల్ రికార్డులకెక్కారు. ఒమర్ అల్ నష్వాన్తో కలిసి గురువారం సౌదీ టీవీ ఛానల్లో న్యూస్ని ప్రెజెంట్ చేశారు వీమ్ అల్ దఖీల్. ఈ నేపథ్యంలో సౌదీస్, ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె పెర్ఫామెన్స్ అద్భుతమని, న్యూస్ని ప్రెజెంట్ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనీ, చాలా గొప్పగా న్యూస్ని ప్రెజెంట్ చేశారని అందరూ అభినందిస్తున్నారు. గతంలో అల్ దఖీల్, సిఎన్బిసి అరేబియాలో పనిచేశారు. మహిళలు సౌదీలోని పలు ఇతర ఛానళ్ళలో పనిచేస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణ చర్యల్లో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







