మౌంటెయిన్స్ పైనుంచి పడి మహిళ మృతి
- September 22, 2018
ఆసియాకి చెందిన ఓ మహిళ, రస్ అల్ ఖైమాలోని ఓ మౌంటెయిన్ నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. రస్ అల్ ఖైమా కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ సులైమాన్ మొహమ్మద్ అల్ కిజి మాట్లాడుతూ, ఘాలియా మౌంటెయిన్ మీదికి తన భర్త, ఇతర స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. ట్రెక్కర్స్ ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, శాటిలైట్ ఫోన్ వంటి సౌకర్యాల్ని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. తగిన శిక్షణ లేకుండా ట్రెక్కింగ్కి వెళ్ళడం ప్రమాదకరమని బ్రిగేడియర్ అల్ కిజి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







