మౌంటెయిన్స్ పైనుంచి పడి మహిళ మృతి
- September 22, 2018
ఆసియాకి చెందిన ఓ మహిళ, రస్ అల్ ఖైమాలోని ఓ మౌంటెయిన్ నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. రస్ అల్ ఖైమా కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ సులైమాన్ మొహమ్మద్ అల్ కిజి మాట్లాడుతూ, ఘాలియా మౌంటెయిన్ మీదికి తన భర్త, ఇతర స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. ట్రెక్కర్స్ ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, శాటిలైట్ ఫోన్ వంటి సౌకర్యాల్ని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. తగిన శిక్షణ లేకుండా ట్రెక్కింగ్కి వెళ్ళడం ప్రమాదకరమని బ్రిగేడియర్ అల్ కిజి చెప్పారు.
తాజా వార్తలు
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!







