తెలంగాణ:ఎన్ఆర్ఐలకూ రైతు బంధు పథకం వర్తింపు
- September 22, 2018
తెలంగాణ:ప్రవాస భారతీయ భూ యజమానులకు శుభవార్త. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పెట్టుబడి కోసం రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి రాయితీ ఎన్ఆర్ఐలకు వర్తింపజేసేందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19 ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తెలంగాణలో నివసించే రైతులకు మాత్రమే రైతు బంధు పెట్టుబడి రాయితీ సొమ్ము చెక్కుల రూపంలో అందజేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సమయంలో ఎన్ఆర్ఐలు స్వయంగా భారత్ రావడం కష్టమైంది. ఈక్రమంలో విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయు భూ యజమానులైన రైతులకు చెక్కుల పంపిణీ విషయంలో ప్రభుత్వంఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఎన్ఆర్ఐ కుటుంబాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణకు చెందిన దాదాపు 60వేల మంది వరకు అమెరికా, గల్ఫ్,ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండవచ్చని అంచనా వేసిన వ్యవసాయశాఖ అర్హులైన ఎన్ఆర్ఐలందరికీ రైతు బంధు పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







