దడ పుట్టిస్తున్న క్రూడ్ ఆయిల్
- September 24, 2018
ఇరాన్పై ఆంక్షలు అమలు గడువు దగ్గరపడేకొద్దీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు జెట్ స్పీడుతో పరుగులు తీస్తున్నాయి. క్రూడ్ ధరలు పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేసినా... ధరలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆదివారం అల్జీరియాలో భేటీ అయిన ఒపెక్ దేశాల తుది నిర్ణయం ఇంకా వెల్లడి కాలేదు. గతవారం తీవ్ర ఒడుదుడుకులకు లోనైన ముడి చమురు ధరలు ఇవాళ ఉదయం నుంచి భారీగా పెరిగాయి. ఇరాన్పై ఆంక్షల వల్ల చమురు సరఫరాలో రోజుకు 15 లక్షల బ్యారెళ్ళ కోత పడుతుంది. మరి దీన్ని భర్తీ చేసేందుకు ఒపెక్ తీసుకున్న చర్యలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.ఏయే దేశం ఎంత మేరకు ఉత్పత్తి పెంచుతాయనే అశంపై కచ్చిత వివరాలు తెలియడం లేదు. అమెరికాలో ముడి చమురు స్టాక్ తగ్గడంతో గతవారం గణనీయంగా పెరిగిన క్రూడ్.. వారాంతాన క్షీణించింది. కాని సోమవారం ఉదయం ఒకేసారి రెండు శాతం పెరగడంతో భారత్ వంటి చమురు కొనుగోలు దేశాల్లో గుబులు మొదలైంది. బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే 80 డాలర్లకు చేరగా, నవంబర్ నెలకల్లా 90 డాలర్లు, ఏడాది చివరికల్లా 100 డాలర్లకు చేరుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







