విడాకుల కేసులో బాధితురాలికి ఊరట
- September 24, 2018బహ్రెయిన్: కష్ట సాధ్యంగా మారిన వైవాహిక జీవితం నుంచి విముక్తి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బహ్రెయినీ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. విడాకుల కేసులో ఆమె విజయం సాధించింది. బాధిత మహిళ తరఫు లాయర్ మనార్ మాట్లాడుతూ, 9 ఏళ్ళ క్రితం ఆమెకు పెళ్ళయ్యిందనీ, అయితే భర్త వేధింపులను భరించలేక ఆమె విడాకులు కోరిందని చెప్పారు. బాధిత మహిళకు పిల్లలు కూడా ఉన్నారు. మూడేళ్ళ క్రితం బాధిత మహిళను ఆమె భర్త ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఓ సారి ఆమెపై భర్త దాడి చేయడంతో, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందింది. ఈ క్రమంలో ఆమె చెవికి సర్జరీ కూడా జరిగినట్లు న్యాయవాది వివరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







