స్నేహితుడ్ని హతమార్చిన స్నేహితులు
- September 25, 2018
దుబాయ్: ఇద్దరు వ్యక్తులు, తమ స్నేహితుడ్ని హత్య చేశారు. దుబాయ్లోని ఎడారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేయడం ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో మొదటి నిందితుడు, తన స్నేహితుడ్ని చంపగా, రెండో నిందితుడు, మొదటి నిందితుడికి సహకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ ఆసియాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మొదటగా ఓ నిందితుడు, బాధితుడి చేతుల్ని తాడుతో గట్టిగా కట్టేయగా, మరో నిందితుడు మెడకు బలంగా ఉరి వేశాడు. తప్పించుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, గట్టిగా అతన్ని కొట్టి, అతని నోటిలో ఇసుకుని కూరేశారు. అనంతరం ఆ వ్యక్తిని ఇసుకలోనే పూడ్చిపెట్టేశారు నిందితులు. ఇసుక తిన్నెల్లో మృతదేహం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







