స్నేహితుడ్ని హతమార్చిన స్నేహితులు
- September 25, 2018
దుబాయ్: ఇద్దరు వ్యక్తులు, తమ స్నేహితుడ్ని హత్య చేశారు. దుబాయ్లోని ఎడారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేయడం ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో మొదటి నిందితుడు, తన స్నేహితుడ్ని చంపగా, రెండో నిందితుడు, మొదటి నిందితుడికి సహకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ ఆసియాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మొదటగా ఓ నిందితుడు, బాధితుడి చేతుల్ని తాడుతో గట్టిగా కట్టేయగా, మరో నిందితుడు మెడకు బలంగా ఉరి వేశాడు. తప్పించుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, గట్టిగా అతన్ని కొట్టి, అతని నోటిలో ఇసుకుని కూరేశారు. అనంతరం ఆ వ్యక్తిని ఇసుకలోనే పూడ్చిపెట్టేశారు నిందితులు. ఇసుక తిన్నెల్లో మృతదేహం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







