స్నేహితుడ్ని హతమార్చిన స్నేహితులు
- September 25, 2018
దుబాయ్: ఇద్దరు వ్యక్తులు, తమ స్నేహితుడ్ని హత్య చేశారు. దుబాయ్లోని ఎడారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేయడం ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో మొదటి నిందితుడు, తన స్నేహితుడ్ని చంపగా, రెండో నిందితుడు, మొదటి నిందితుడికి సహకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ ఆసియాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మొదటగా ఓ నిందితుడు, బాధితుడి చేతుల్ని తాడుతో గట్టిగా కట్టేయగా, మరో నిందితుడు మెడకు బలంగా ఉరి వేశాడు. తప్పించుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, గట్టిగా అతన్ని కొట్టి, అతని నోటిలో ఇసుకుని కూరేశారు. అనంతరం ఆ వ్యక్తిని ఇసుకలోనే పూడ్చిపెట్టేశారు నిందితులు. ఇసుక తిన్నెల్లో మృతదేహం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







