స్నేహితుడ్ని హతమార్చిన స్నేహితులు
- September 25, 2018
దుబాయ్: ఇద్దరు వ్యక్తులు, తమ స్నేహితుడ్ని హత్య చేశారు. దుబాయ్లోని ఎడారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేయడం ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో మొదటి నిందితుడు, తన స్నేహితుడ్ని చంపగా, రెండో నిందితుడు, మొదటి నిందితుడికి సహకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ ఆసియాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మొదటగా ఓ నిందితుడు, బాధితుడి చేతుల్ని తాడుతో గట్టిగా కట్టేయగా, మరో నిందితుడు మెడకు బలంగా ఉరి వేశాడు. తప్పించుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, గట్టిగా అతన్ని కొట్టి, అతని నోటిలో ఇసుకుని కూరేశారు. అనంతరం ఆ వ్యక్తిని ఇసుకలోనే పూడ్చిపెట్టేశారు నిందితులు. ఇసుక తిన్నెల్లో మృతదేహం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి