ఒక్క రూపాయికే రూ.10 లక్షల బీమా!! వివరాలు చూడండి..
- September 25, 2018
ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని బీమా సంస్థలతో కలిసి ఈ స్కీమ్ను అమల్లోకి తెచ్చింది. అదేసమయంలో తన ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రైలు ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పించింది.
ఈ-టికెట్ తీసుకునే ప్రయాణికులకు బీమాను ఆప్షన్గా మార్చింది. ఇకపై ఆన్లైన్లో ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు బీమా కావాలా? వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. టికెట్ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్ కూడా ఒక ఆప్షన్గా ఇస్తుంది. కావాల్సిన వారికి రూ.1 అదనంగా వసూలు చేస్తారు.
ఆన్లైన్ విధానంలో టికెట్ బుకింగ్లను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్ నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ విధానం ఈ నెల 2 వరకు కొనసాగింది. దాదాపు 9 నెలల పాటు ప్రయాణికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఖర్చులు పెరిగిపోవడంతో ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది.
స్లీపర్, ఏసీ, చెైర్ కార్ సీట్ల కోసం టికెట్లు బుక్ చేసే ప్రయాణికులు బీమా కావాలా వద్దా? అన్నది ఇకపై వారికే వదిలేసింది. దీనికోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్ ఫైనాన్స్లాంటి సంస్థలతో రైల్వే శాఖ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే.. రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







