వేతనాలు చెల్లించని ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ కాంట్రాక్టర్
- September 26, 2018
ఖతార్:2022 ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించి స్టేడియం నిర్మాణం చేపడ్తోన్న కాంట్రాక్టర్, కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది. హక్కుల సంస్థ ఆమ్నెస్టీ, ఈ మేరకు ఓ రిపోర్ట్ని విడుదల చేసింది. మెర్క్యురీ మెనా, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. ఇండియా, నేపాల్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి వచ్చిన కార్మికులు ఈ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. ఖతార్ లుసైల్స్టేడియం పనుల్లోనూ వీరు పాల్గొంటున్నారు. అయితే లేబర్ మినిస్ట్రీ మాత్రం, ఖతార్లో మెర్యుకరీ మెనా ఎలాంటి కార్యకలాపాలు ప్రస్తుతం నిర్వహించడంలేదనీ, దీనిపై చట్ట పరమైన కోణంలో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. మెర్యురీ మెనా మాత్రం ఈ ఆరోపణలపై ఇంతవరకు స్పందించలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







