ఒమన్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
- September 26, 2018
మస్కట్: ఒమన్లో రోడ్డు ప్రమాదాలు 7.3 శాతం వరకు తగ్గినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. 2017 ఆగస్ట్తో పోల్చితే 2018 ఆగస్ట్లో తగ్గిన ప్రమాదాల శాతం 7.3గా నమోదయ్యింది. 2018 ఆగస్ట్లో మొత్తం 215 ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాలు చెబుతున్నాయి. మస్కట్ గవర్నరేట్ పరిధిలో 26 శాతం ప్రమాదాలు ఈ ఆగస్ట్లో జరిగాయి. ఆ తర్వాతి స్థానం దఖ్లియాలో 16.7 శాతం, సౌత్ అల్ బతినా 12.6 శాతం, నార్త్ అల్ బతినాలో 11.2 శాతం ప్రమాదాలు జరిగాయి. మిగతా గవర్నరేట్స్లో 33.5 శాతం ప్రమాదాలు జరిగినట్లు నివేదిక చెబుతోంది. రాత్రి వేళల్లో 56 శాతం ప్రమాదాలు జరగగా, పగటి వేల 44 శాతం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2017 తో పోల్చితే మృతుల సంఖ్య పెరిగింది. 75 మంది చనిపోయారు. వీరిలో 30 మంది ఒమనీయులు కాగా, 45 మంది వలసదారులు. గాయపడ్డవారి సంఖ్య 238. వీరిలో 174 మంది ఒమనీయులు, 64 మంది వలసదారులున్నారు.
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







