ఒమన్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
- September 26, 2018
మస్కట్: ఒమన్లో రోడ్డు ప్రమాదాలు 7.3 శాతం వరకు తగ్గినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. 2017 ఆగస్ట్తో పోల్చితే 2018 ఆగస్ట్లో తగ్గిన ప్రమాదాల శాతం 7.3గా నమోదయ్యింది. 2018 ఆగస్ట్లో మొత్తం 215 ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాలు చెబుతున్నాయి. మస్కట్ గవర్నరేట్ పరిధిలో 26 శాతం ప్రమాదాలు ఈ ఆగస్ట్లో జరిగాయి. ఆ తర్వాతి స్థానం దఖ్లియాలో 16.7 శాతం, సౌత్ అల్ బతినా 12.6 శాతం, నార్త్ అల్ బతినాలో 11.2 శాతం ప్రమాదాలు జరిగాయి. మిగతా గవర్నరేట్స్లో 33.5 శాతం ప్రమాదాలు జరిగినట్లు నివేదిక చెబుతోంది. రాత్రి వేళల్లో 56 శాతం ప్రమాదాలు జరగగా, పగటి వేల 44 శాతం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2017 తో పోల్చితే మృతుల సంఖ్య పెరిగింది. 75 మంది చనిపోయారు. వీరిలో 30 మంది ఒమనీయులు కాగా, 45 మంది వలసదారులు. గాయపడ్డవారి సంఖ్య 238. వీరిలో 174 మంది ఒమనీయులు, 64 మంది వలసదారులున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







