ఆధార్కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
- September 26, 2018
ఇండియా:ఆధార్కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ప్రకటించింది.. ఆధార్ చట్టబద్ధతను జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధించింది. మెజార్టీ న్యాయమూర్తులు ఆధార్ సరైందే అని అభిప్రాయపడ్డారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్ మంచి గుర్తింపు కార్డని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.. ఇతర గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ చాలా మెరుగ్గా ఉందని సుప్రీం అభిప్రాయపడింది.. అయితే ఆధార్ జారీ విషయంలో పలు సూచనలు చేసింది..
ఒక వ్యక్తికి సంబంధించిన అంత్యత కీలక సమాచారాన్ని ఇతరుల చేతికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం స్పష్టం చేసింది.. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతికి ఇతరుల సమాచాం ఇవ్వొద్దని హెచ్చరించింది. అలాగే బ్యాంక్లకు ఆధార్ను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆధార్ను తప్పని సరి చేయడం సరైంది కాదని అభిప్రాయపడింది. మరోవైపు మొబైల్ పోన్లకు కూడా ఆధార్ను లింకు చేయాల్సిన అవసరం ఏముందని సుప్రీం ప్రశ్నించింది..
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







