ఆధార్కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
- September 26, 2018
ఇండియా:ఆధార్కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ప్రకటించింది.. ఆధార్ చట్టబద్ధతను జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధించింది. మెజార్టీ న్యాయమూర్తులు ఆధార్ సరైందే అని అభిప్రాయపడ్డారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్ మంచి గుర్తింపు కార్డని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.. ఇతర గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ చాలా మెరుగ్గా ఉందని సుప్రీం అభిప్రాయపడింది.. అయితే ఆధార్ జారీ విషయంలో పలు సూచనలు చేసింది..
ఒక వ్యక్తికి సంబంధించిన అంత్యత కీలక సమాచారాన్ని ఇతరుల చేతికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం స్పష్టం చేసింది.. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతికి ఇతరుల సమాచాం ఇవ్వొద్దని హెచ్చరించింది. అలాగే బ్యాంక్లకు ఆధార్ను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆధార్ను తప్పని సరి చేయడం సరైంది కాదని అభిప్రాయపడింది. మరోవైపు మొబైల్ పోన్లకు కూడా ఆధార్ను లింకు చేయాల్సిన అవసరం ఏముందని సుప్రీం ప్రశ్నించింది..
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







