ఆధార్కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
- September 26, 2018
ఇండియా:ఆధార్కు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ప్రకటించింది.. ఆధార్ చట్టబద్ధతను జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధించింది. మెజార్టీ న్యాయమూర్తులు ఆధార్ సరైందే అని అభిప్రాయపడ్డారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్ మంచి గుర్తింపు కార్డని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.. ఇతర గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ చాలా మెరుగ్గా ఉందని సుప్రీం అభిప్రాయపడింది.. అయితే ఆధార్ జారీ విషయంలో పలు సూచనలు చేసింది..
ఒక వ్యక్తికి సంబంధించిన అంత్యత కీలక సమాచారాన్ని ఇతరుల చేతికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం స్పష్టం చేసింది.. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతికి ఇతరుల సమాచాం ఇవ్వొద్దని హెచ్చరించింది. అలాగే బ్యాంక్లకు ఆధార్ను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆధార్ను తప్పని సరి చేయడం సరైంది కాదని అభిప్రాయపడింది. మరోవైపు మొబైల్ పోన్లకు కూడా ఆధార్ను లింకు చేయాల్సిన అవసరం ఏముందని సుప్రీం ప్రశ్నించింది..
తాజా వార్తలు
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







