భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- September 26, 2018
హైదరాబాద్: జంట నగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకపూల్, బషీర్బాగ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, యూసుఫ్గూడ, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, ఓయూ, విద్యానగర్, ఖైరతాబాద్, హిమాయత్నగర్, నాంపల్లి, అఫ్జల్గంజ్, లిబర్టీ, ఆర్టీసీక్రాస్రోడ్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హిమాయత్నగర్, రాజేంద్రనగర్, బుద్వేల్, అత్తాపూర్, కిస్మత్పూర్, మైలార్దేవ్పల్లి తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నీటినిల్వను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. సమస్యలుంటే డయల్ 100కు గాని, కాల్సెంటర్ 040-21111111లకు ఫోన్ చేయాలని కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వర్షపు నీరు వచ్చిచేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.6కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







