భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- September 26, 2018
హైదరాబాద్: జంట నగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకపూల్, బషీర్బాగ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, యూసుఫ్గూడ, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, ఓయూ, విద్యానగర్, ఖైరతాబాద్, హిమాయత్నగర్, నాంపల్లి, అఫ్జల్గంజ్, లిబర్టీ, ఆర్టీసీక్రాస్రోడ్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హిమాయత్నగర్, రాజేంద్రనగర్, బుద్వేల్, అత్తాపూర్, కిస్మత్పూర్, మైలార్దేవ్పల్లి తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నీటినిల్వను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. సమస్యలుంటే డయల్ 100కు గాని, కాల్సెంటర్ 040-21111111లకు ఫోన్ చేయాలని కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వర్షపు నీరు వచ్చిచేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.6కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







