భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- September 26, 2018
హైదరాబాద్: జంట నగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకపూల్, బషీర్బాగ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, యూసుఫ్గూడ, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, ఓయూ, విద్యానగర్, ఖైరతాబాద్, హిమాయత్నగర్, నాంపల్లి, అఫ్జల్గంజ్, లిబర్టీ, ఆర్టీసీక్రాస్రోడ్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హిమాయత్నగర్, రాజేంద్రనగర్, బుద్వేల్, అత్తాపూర్, కిస్మత్పూర్, మైలార్దేవ్పల్లి తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నీటినిల్వను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. సమస్యలుంటే డయల్ 100కు గాని, కాల్సెంటర్ 040-21111111లకు ఫోన్ చేయాలని కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వర్షపు నీరు వచ్చిచేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.6కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







