ఫొటో తీస్తే 150,000 జరీమానా

- September 26, 2018 , by Maagulf
ఫొటో తీస్తే 150,000 జరీమానా

దుబాయ్‌: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంఘటనల్ని ఫొటో తీయాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలా ఫొటోలు తీసేవారికి 150,000 దిర్హామ్‌ల వరకు జరీమానా పడుతుంది. అబుదాబీ పోలీస్‌ఈ మేరకు నిబంధనల్ని ప్రస్తావిస్తూ, ఉల్లంఘనులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాల్ని ఫొటోల్లో బంధించాలనుకోవడం హేయమైన చర్య అని అబుదాబీ పోలీస్‌ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ ఖలీఫా మొహమ్మద్‌ అల్‌ ఖలిల్‌ చెప్పారు. కొందరు చేసే ఇలాంటి చర్యల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనీ, అది ఒక్కోసారి ప్రాణాల్ని బలికొనేంత ఆలస్యానికి కారణమవుతుందని ఆయన అన్నారు. యూఏఈ సైబర్‌ క్రైమ్‌ చట్టం ప్రకారం సోషల్‌ మీడియాలో ఎవరూ ప్రమాదాలకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్‌ చేయరాదని స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com