ఫొటో తీస్తే 150,000 జరీమానా
- September 26, 2018
దుబాయ్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంఘటనల్ని ఫొటో తీయాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలా ఫొటోలు తీసేవారికి 150,000 దిర్హామ్ల వరకు జరీమానా పడుతుంది. అబుదాబీ పోలీస్ఈ మేరకు నిబంధనల్ని ప్రస్తావిస్తూ, ఉల్లంఘనులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాల్ని ఫొటోల్లో బంధించాలనుకోవడం హేయమైన చర్య అని అబుదాబీ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీఫా మొహమ్మద్ అల్ ఖలిల్ చెప్పారు. కొందరు చేసే ఇలాంటి చర్యల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనీ, అది ఒక్కోసారి ప్రాణాల్ని బలికొనేంత ఆలస్యానికి కారణమవుతుందని ఆయన అన్నారు. యూఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం సోషల్ మీడియాలో ఎవరూ ప్రమాదాలకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్ చేయరాదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







