ఫొటో తీస్తే 150,000 జరీమానా
- September 26, 2018
దుబాయ్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంఘటనల్ని ఫొటో తీయాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలా ఫొటోలు తీసేవారికి 150,000 దిర్హామ్ల వరకు జరీమానా పడుతుంది. అబుదాబీ పోలీస్ఈ మేరకు నిబంధనల్ని ప్రస్తావిస్తూ, ఉల్లంఘనులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాల్ని ఫొటోల్లో బంధించాలనుకోవడం హేయమైన చర్య అని అబుదాబీ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీఫా మొహమ్మద్ అల్ ఖలిల్ చెప్పారు. కొందరు చేసే ఇలాంటి చర్యల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనీ, అది ఒక్కోసారి ప్రాణాల్ని బలికొనేంత ఆలస్యానికి కారణమవుతుందని ఆయన అన్నారు. యూఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం సోషల్ మీడియాలో ఎవరూ ప్రమాదాలకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్ చేయరాదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!