ఢిల్లీలో విషాదం.. భవనం కూలి 5 మంది మృతి..
- September 26, 2018
ఢిల్లీ:ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. శిధిలావ్యవస్థలో ఉన్న ఓ భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్3లో ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు ఆరుగురితో కూడిన రెస్క్యూ టీమ్ పనిచేస్తోంది. కాగా ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన మహిళను మున్నీగా గుర్తించారు. ఇదిలావుంటే ఈ భవనం 20 ఏళ్ల క్రితం నాటిదని, శిథిలావస్థకి చేరుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







