కమల్ హాసన్ మళ్ళీ సీక్వెల్

- September 26, 2018 , by Maagulf
కమల్ హాసన్ మళ్ళీ సీక్వెల్

కమల్ హాసన్ తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన భారతీయడు సీక్వెల్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కమల్ కు తనదే మరో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తీయాలని మనసులో ఉందట. కమల్‌హాసన్‌ నటించిన చిత్రం 'క్షత్రియ పుత్రుడు'. శివాజీ గణేశన్‌, రేవతి, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు.

కమల్‌ నిర్మాతగా, రచయితగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఐదు జాతీయ అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు 65వ అకాడమీ అవార్డులకు గానూ ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్‌ నుంచి ఆస్కార్ అవార్డు కోసం నామినేట్‌ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ చేయాలని కమల్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com