హైదరాబాద్‌లో వాజ్‌పేయి స్మారక భవనం: కేసీఆర్

- September 27, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో వాజ్‌పేయి స్మారక భవనం: కేసీఆర్

హైదరాబాద్: నగరంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి స్మారక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభమైంది. ఆపద్ధర్మ సీఎం హోదాలో మండలికి హాజరైన కేసీఆర్ నాలుగు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాజ్‌పేయి మృతికి మండలి నివాళి అర్పించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ ప్రధానుల్లో వాజ్‌పేయి విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. హైదరాబాద్‌లో వాజ్‌పేయి స్మారక భవనంతో పాటు ఎకరా స్థలంలో స్మారక స్థూపం, విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com