భారీ బడ్జెట్‌తో మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

- September 27, 2018 , by Maagulf
భారీ బడ్జెట్‌తో మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. కన్ఫెషన్స్ ఆప్ థగ్ అనే నవల ఆధారంగా, పీరియాడిక్ ఫిల్మా గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com