పెట్రోల్ ధరల్ని పెంచిన యూఏఈ
- September 27, 2018
యూఏఈ:వాహనదారులు అక్టోబర్ నెలలో ఇంకాస్త ఎక్కువ మొత్తాన్ని పెట్రోల్ కోసం వినియోగించాల్సి వుంటుంది. అక్టోబర్ నెలకుగాను యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ నెలకుగాను పెట్రోల్ ధరల్ని పెంచడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.61 దిర్హామ్లుగా నిర్ణయించారు. ఇప్పటిదాకా అది 2.59 దిర్హామ్లు మాత్రమే. 95 స్పెషల్ కేటగిరీ పెట్రోల్ ధర 2.48 దిర్హామ్ల నుంచి 2.50 దిర్హామ్లకు పెంచడం జరిగింది. డీజిల్ ధర 2.64 నుంచి 12 ఫిల్స్ పెరిగి, 2.76 దిర్హామ్లకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







