పెట్రోల్ ధరల్ని పెంచిన యూఏఈ
- September 27, 2018యూఏఈ:వాహనదారులు అక్టోబర్ నెలలో ఇంకాస్త ఎక్కువ మొత్తాన్ని పెట్రోల్ కోసం వినియోగించాల్సి వుంటుంది. అక్టోబర్ నెలకుగాను యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ నెలకుగాను పెట్రోల్ ధరల్ని పెంచడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.61 దిర్హామ్లుగా నిర్ణయించారు. ఇప్పటిదాకా అది 2.59 దిర్హామ్లు మాత్రమే. 95 స్పెషల్ కేటగిరీ పెట్రోల్ ధర 2.48 దిర్హామ్ల నుంచి 2.50 దిర్హామ్లకు పెంచడం జరిగింది. డీజిల్ ధర 2.64 నుంచి 12 ఫిల్స్ పెరిగి, 2.76 దిర్హామ్లకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి