బెంగళూరు విమానాశ్రయంలో నూతన సాంకేతికత అమలు
- September 27, 2018
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(బీఐఏఎల్) అతి త్వరలో బయోమెట్రిక్ టెక్నాలజీని సమకూర్చుకోనుంది. ప్రయాణికులను సమగ్రంగా పర్యవేక్షించే ముఖ కవళికల గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానంతో ఈ బయోమెట్రిక్ సాంకేతికతను త్వరలో అమలు చేయనున్నారు. జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్ల ద్వారా రాకపోకలు సాగించిన ప్రయాణికులకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. లిస్బన్ ఆధారిత డిజిటల్, బయోమెట్రిక్ సొల్యూషన్ సంస్థ అందించే సాంకేతికతతో ఈ విధాన అమలుకు ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్ బోర్డింగ్ టెక్నాలజీతో ప్రయాణికులను సునిశితంగా పర్యవేక్షించదగిన ఈ విధానాన్ని అమలు చేసిన తొలి విమానాశ్రయం బీఐఏఎల్ కానుందని సంస్థ ఎం.డి. హరిమరార్ చెప్పారు. విమానాశ్రయం పరిసరాల్లో అనవసరంగా తిరిగే వారితో పాటు బోర్డింగ్ పాసుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ యాత్ర ప్రాజెక్టు నిధులు కూడా ఈ సరికొత్త విధానానికి ఉపయోగించే వీలుందన్న ఆయన రానున్న జనవరిలోపు బయోమెట్రిక్ను అమలు చేయనుండగా ఈ విధానంతో ప్రయాణికుల సరకుల పరిశీలన కూడా వేగవంతం కానుందన్నారు. బయోమెట్రిక్తో పాటు కాగితరహిత విమానాశ్రయంగా కూడా బీఐఏఎల్ రూపుదిద్దుకోనుందని హరిమరార్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ఆధునికతలకు ఇది నిలయంగా మారుతుందని వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









