బెంగళూరు విమానాశ్రయంలో నూతన సాంకేతికత అమలు
- September 27, 2018
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(బీఐఏఎల్) అతి త్వరలో బయోమెట్రిక్ టెక్నాలజీని సమకూర్చుకోనుంది. ప్రయాణికులను సమగ్రంగా పర్యవేక్షించే ముఖ కవళికల గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానంతో ఈ బయోమెట్రిక్ సాంకేతికతను త్వరలో అమలు చేయనున్నారు. జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్ల ద్వారా రాకపోకలు సాగించిన ప్రయాణికులకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. లిస్బన్ ఆధారిత డిజిటల్, బయోమెట్రిక్ సొల్యూషన్ సంస్థ అందించే సాంకేతికతతో ఈ విధాన అమలుకు ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్ బోర్డింగ్ టెక్నాలజీతో ప్రయాణికులను సునిశితంగా పర్యవేక్షించదగిన ఈ విధానాన్ని అమలు చేసిన తొలి విమానాశ్రయం బీఐఏఎల్ కానుందని సంస్థ ఎం.డి. హరిమరార్ చెప్పారు. విమానాశ్రయం పరిసరాల్లో అనవసరంగా తిరిగే వారితో పాటు బోర్డింగ్ పాసుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ యాత్ర ప్రాజెక్టు నిధులు కూడా ఈ సరికొత్త విధానానికి ఉపయోగించే వీలుందన్న ఆయన రానున్న జనవరిలోపు బయోమెట్రిక్ను అమలు చేయనుండగా ఈ విధానంతో ప్రయాణికుల సరకుల పరిశీలన కూడా వేగవంతం కానుందన్నారు. బయోమెట్రిక్తో పాటు కాగితరహిత విమానాశ్రయంగా కూడా బీఐఏఎల్ రూపుదిద్దుకోనుందని హరిమరార్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ఆధునికతలకు ఇది నిలయంగా మారుతుందని వివరించారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







