భారత్ వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన పాక్
- September 27, 2018
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన సార్క్ మంత్రుల భేటీ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్యలోనే లేచివెళ్లిపోయారు. ఈ ఘటన పట్ల పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సార్క్ దేశాల ప్రగతిలో ఒక దేశ ప్రవర్తనే అవరోధంగా మారిందని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఆరోపించారు. భారత్ నుంచి పాజిటివ్ స్పందన లేదని, సుష్మా సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారని పాక్ మంత్రి విమర్శించారు. అయితే ఇతర కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో సుష్మా.. సార్క్ భేటీ నుంచి అకస్మాత్తుగా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ అంతకముందు సుష్మా స్వరాజ్ చాలా స్పష్టమైన సందేశాన్నిచ్చారు. దక్షిణ ఆసియా దేశాలకు ఉగ్రవాదం వల్ల పెను ప్రమాదం ఉందని, అలాంటి సందర్భాల్లో ప్రాంతీయ సహాకారాన్ని ఆశించలేమని సుష్మా తన ప్రసంగంలో తెలిపారు. రోజు రోజుకూ ఉగ్ర ఘటనలు దక్షిణ ఆసియాలో ఎక్కువ అవుతున్నాయని, ఉగ్రవాదమే మన ప్రాంతంలో శాంతి విఘాతంగా మారిందని, అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని రూపుమాపాలని, ఉగ్రమూకలకు చేయూతనిస్తున్న వారిని కూడా వెలివేయాలని సుష్మా అన్నారు. తీర్మానాలను అమలు చేస్తేనే ప్రగతి ఉంటుందని సుష్మా తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి మాత్రం ఇండియా వైఖరిని తప్పుపట్టారు. సదస్సులో పాల్గొనకుండా, అనుకూల వాతావరణం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!