భారత్ వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన పాక్
- September 27, 2018
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన సార్క్ మంత్రుల భేటీ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్యలోనే లేచివెళ్లిపోయారు. ఈ ఘటన పట్ల పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సార్క్ దేశాల ప్రగతిలో ఒక దేశ ప్రవర్తనే అవరోధంగా మారిందని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఆరోపించారు. భారత్ నుంచి పాజిటివ్ స్పందన లేదని, సుష్మా సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారని పాక్ మంత్రి విమర్శించారు. అయితే ఇతర కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో సుష్మా.. సార్క్ భేటీ నుంచి అకస్మాత్తుగా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ అంతకముందు సుష్మా స్వరాజ్ చాలా స్పష్టమైన సందేశాన్నిచ్చారు. దక్షిణ ఆసియా దేశాలకు ఉగ్రవాదం వల్ల పెను ప్రమాదం ఉందని, అలాంటి సందర్భాల్లో ప్రాంతీయ సహాకారాన్ని ఆశించలేమని సుష్మా తన ప్రసంగంలో తెలిపారు. రోజు రోజుకూ ఉగ్ర ఘటనలు దక్షిణ ఆసియాలో ఎక్కువ అవుతున్నాయని, ఉగ్రవాదమే మన ప్రాంతంలో శాంతి విఘాతంగా మారిందని, అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని రూపుమాపాలని, ఉగ్రమూకలకు చేయూతనిస్తున్న వారిని కూడా వెలివేయాలని సుష్మా అన్నారు. తీర్మానాలను అమలు చేస్తేనే ప్రగతి ఉంటుందని సుష్మా తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి మాత్రం ఇండియా వైఖరిని తప్పుపట్టారు. సదస్సులో పాల్గొనకుండా, అనుకూల వాతావరణం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ పర్యటన.. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్తో
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







