శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

- September 27, 2018 , by Maagulf
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నెలసరి సమస్యల కారణం చూపుతూ (10-50 ఏళ్ల మధ్య వయసు గల) మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాల్‌ పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. దీనిపై శుక్రవారం తుది తీర్పు వెలువరిస్తూ.. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలో వారికి నిషేధం విధించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పురుషులతో పోలిస్తే మహిళలు దేనిలోనూ బలహీనులు కారని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com