హౌతీ మిస్సైల్ని కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- September 28, 2018
సౌదీ అరేబియా:సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు, హౌతీ రెబల్స్ పేల్చిన బాలిస్టిక్ మిస్సైల్ని కూల్చివేయడం జరిగింది. యెమెన్ సదరన్ పోర్ట్ సిటీ ఆఫ్ అదెన్ వైపుగా ఈ మిస్సైల్ని సంధించినట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ సంకీర్ణ దళాలకు చెందిన మెయిన్ హెడ్ క్వార్టర్ని తీవ్రవాదులు టార్గెట్ చేశారనీ, అయితే వారి వ్యూహాల్ని తిప్పి కొట్టామని సంకీర్ణ బలగాలు ప్రకటించాయి. అదెన్స్లోని బురైగా డిస్ట్రిక్ట్ వైపు మిస్సైల్ని తీవ్రవాదులు సంధించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సౌదీ సంకీర్ణ దళాలకు, యెమెన్తో పోరాడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దళాలకు బురైగా అత్యంత కీలకమైన ప్రాంతం. భారీ పేలుడు శబ్దం తమకు విన్పించిందంటూ స్థానిక ప్రజానీకం పేర్కొన్నారు. యెమెన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మువామర్ అల్ ఇర్యానీ ఈ ఘటనను ధృవీకరించారు. అయితే సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రెండు మిస్సైళ్ళను కూల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి