హౌతీ మిస్సైల్ని కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- September 28, 2018
సౌదీ అరేబియా:సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు, హౌతీ రెబల్స్ పేల్చిన బాలిస్టిక్ మిస్సైల్ని కూల్చివేయడం జరిగింది. యెమెన్ సదరన్ పోర్ట్ సిటీ ఆఫ్ అదెన్ వైపుగా ఈ మిస్సైల్ని సంధించినట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ సంకీర్ణ దళాలకు చెందిన మెయిన్ హెడ్ క్వార్టర్ని తీవ్రవాదులు టార్గెట్ చేశారనీ, అయితే వారి వ్యూహాల్ని తిప్పి కొట్టామని సంకీర్ణ బలగాలు ప్రకటించాయి. అదెన్స్లోని బురైగా డిస్ట్రిక్ట్ వైపు మిస్సైల్ని తీవ్రవాదులు సంధించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సౌదీ సంకీర్ణ దళాలకు, యెమెన్తో పోరాడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దళాలకు బురైగా అత్యంత కీలకమైన ప్రాంతం. భారీ పేలుడు శబ్దం తమకు విన్పించిందంటూ స్థానిక ప్రజానీకం పేర్కొన్నారు. యెమెన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మువామర్ అల్ ఇర్యానీ ఈ ఘటనను ధృవీకరించారు. అయితే సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రెండు మిస్సైళ్ళను కూల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







