హౌతీ మిస్సైల్ని కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- September 28, 2018
సౌదీ అరేబియా:సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు, హౌతీ రెబల్స్ పేల్చిన బాలిస్టిక్ మిస్సైల్ని కూల్చివేయడం జరిగింది. యెమెన్ సదరన్ పోర్ట్ సిటీ ఆఫ్ అదెన్ వైపుగా ఈ మిస్సైల్ని సంధించినట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ సంకీర్ణ దళాలకు చెందిన మెయిన్ హెడ్ క్వార్టర్ని తీవ్రవాదులు టార్గెట్ చేశారనీ, అయితే వారి వ్యూహాల్ని తిప్పి కొట్టామని సంకీర్ణ బలగాలు ప్రకటించాయి. అదెన్స్లోని బురైగా డిస్ట్రిక్ట్ వైపు మిస్సైల్ని తీవ్రవాదులు సంధించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సౌదీ సంకీర్ణ దళాలకు, యెమెన్తో పోరాడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దళాలకు బురైగా అత్యంత కీలకమైన ప్రాంతం. భారీ పేలుడు శబ్దం తమకు విన్పించిందంటూ స్థానిక ప్రజానీకం పేర్కొన్నారు. యెమెన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మువామర్ అల్ ఇర్యానీ ఈ ఘటనను ధృవీకరించారు. అయితే సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రెండు మిస్సైళ్ళను కూల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







