ఇండోనేషియాలో సునామీ.. 48 మంది మృతి

- September 28, 2018 , by Maagulf
ఇండోనేషియాలో సునామీ.. 48 మంది మృతి

ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ బీభత్సానికి 48 మంది చనిపోయారు. సులవేసి ద్వీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సునామీ బీభత్సంతో తీరప్రాంతాల్లో చాలా మృత దేహాలను కనుగొన్నామని, ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నామని ఇండోనేషియా జాతీయ విపత్తుల ఏజెన్సీ ప్రతినిధి నుగ్రోహో తెలిపారు. భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com