మసూద్కు చైనా అండ
- September 29, 2018
న్యూయార్క్ : ఉగ్రవాది అజర్ మసూద్కు చైనా మళ్లీ అండగా నిలిచింది. జేషే మొహమ్మద్ చీఫ్ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అందరి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మసూద్ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్, పాక్ మధ్య ఒకేరకమైన అభిప్రాయాలు వ్యక్తం కావడం లేదని, ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే తాము మద్దతు ఇస్తామని చైనా మంత్రి తెలిపారు. భద్రతా మండలిలో పర్మనెంట్ సభ్య దేశమైన చైనా.. మసూద్ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంలో అడ్డు చెబుతోంది. భారత్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో మసూద్ ప్రమేయం ఉందన్న విషయం తెలిసిందే. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా అడ్డుకున్నది. పఠాన్కోట్ దాడుల సూత్రధారిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో భారత్ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదన చేసింది. అయితే అమెరికా మసూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు సిద్ధమైంది. కానీ అప్పుడు చైనా తనకు ఆగస్టు 2వ తేదీ వరకు డెడ్లైన్ ఇవ్వాలంటూ తెలిపింది. దాని ప్రకారమే అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించలేకపోయారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..